గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి.
డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ను విచారిస్తున్న సమయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. కెల్విన్ కాల్డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటికొచ్చాయి.
ఇక ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న వారి లిస్ట్ ఇలా ఉంది….
హీరోలు: రవితేజ – తరుణ్ – నవదీప్ – తనీష్ – నందు – సుబ్బరాజు
హీరోయిన్లు: చార్మీ – ముమైత్ ఖాన్,
డైరెక్టర్ పూరీ జగన్నాథ్,
కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు,
ఆర్ట్ డైరెక్టర్ చిన్నా
శ్రీనివాసరావు (రవితేజ డ్రైవర్)
ఇక టాప్ హీరోలతో పాటు హీరోయిన్లు, డైరెక్టర్లు, యంగ్ హీరోలు సైతం డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకోవడంతో టాలీవుడ్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఇక వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తోన్న కెల్విన్ నాలుగేళ్ల నుంచి ఇదే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.