జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా తన ఇంట్లోనే పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన వాపోయారు. అయితే ఇదంతా సీరియస్గా కాదు సుమా…సరదాగా. తనకు వ్యతిరేకంగా కుట్ర చేసేది ఎవరో కాదని తన కుమారుడు అభయ్రామ్, వాళ్ల అమ్మేనని చెప్పాడు. ఈ విషయంలో తాను వాళ్లతో ఏదో ఒకటి తేల్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పాడు.
ఇక తనపై ఇంట్లో వాళ్లిద్దరు ఎందుకు కుట్ర చేస్తున్నారో కూడా ఎన్టీఆర్ చెప్పాడు. తాను ప్రతి రోజు షూటింగ్కు వెళ్లేముందు తన కుమారుడిని దగ్గరకు తీసుకుని “నీకు ఎవరంటే ఇష్టం నాన్నా… అమ్మా ? నాన్నా?” అని అడిగితే వాడు
నాన్న అని ఠక్కున సమాధానం చెప్పేవాడని…అయితే ఇటీవల తన కొడుకును స్కూల్లో జాయిన్ చేయడంతో తాను షూటింగ్ నుంచి వచ్చే సరికి వాడు నిద్రపోతున్నాడు…అలాగే తాను ఉదయం నిద్ర లేచే సరికి స్కూల్కు వెళ్లిపోవడం జరుగుతోందని ఎన్టీఆర్ చెప్పాడు.
ఈ మధ్య ఓ రోజు ఉదయం అభయ్ ఎన్టీఆర్ దగ్గరకు నాన్నా అనుకుంటూ వచ్చాడట. ” నాన్నా నీకు ఎవరంటే ఇష్టం అమ్మా ? నాన్నా ? ” అని అడగ్గానే ఎప్పుడూ “నాన్న” అనే వాడు అకస్మాత్తుగా “అమ్మ” అనడంతో షాక్ అవ్వడం ఎన్టీఆర్ వంతు అయ్యిందట.
ఎన్టీఆర్ ఇటీవల జై లవకుశ సినిమా షూటింగ్తో పాటు బిగ్ బాస్ షో షూటింగ్లో బిజీ కావడంతో తన కొడుకు, వాళ్ల అమ్మ ఒక్కటైపోయారని, తనకు తెలియకుండానే తన ఇంట్లో పెద్ద కుట్ర జరుగుతోందని… ఈ విషయంలో తాను తన కొడుకుతో పాటు వాళ్లమ్మతో వెంటనే తేల్చుకోవాలని సరదాగా అనేశాడు. అది ఎన్టీఆర్ ఇంట్లో ఎన్టీఆర్కు తెలియకుండా జరుగుతోన్న అసలు కుట్ర.