పాలిటిక్స్లో ఒక్కో సంఘటన, ఒక్కో స్టెప్ కొందరిని జీరోలను చేస్తే..మరికొందరిని వారు ఊహించలేనంత హీరోలను చేస్తుంది. సరిగ్గా వైసీపీ ఫైర్బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా వ్యవహారం కూడా ఇలాగే అయ్యింది. ఆమె నోటి దురుసుతనం వ్యవహారంలో అప్పటి వరకు ఎక్కడుందో కూడా తెలియని టీడీపీకి చెందిన విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఒక్కసారిగా లైమ్టైమ్లోకి వచ్చేశారు.
రోజా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును టార్గెట్ చేయడంతో ఆమెను ఎటాక్ చేసే విషయంలో మిగిలిన మహిళల కన్నా కాస్త ముందుంది అనిత. అందివచ్చిన అవకాశాన్ని ఆమె చక్కగా యూజ్ చేసుకుంది. మరో మంత్రి పీతల సుజాతను సైతం రోజా దారుణంగా విమర్శించింది. అయితే సుజాత కన్నా అనితే రోజాను బాగా ఎటాక్ చేసింది. ఈ క్రమంలోనే పార్టీలోను, చంద్రబాబు వద్ద ఆమెకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం చంద్రబాబు వద్ద అనితకు టీడీపీలో కొందరు సీనియర్లతో పాటు మంత్రులకు సైతం లేని ప్రాధాన్యత ఉందట. ఈ నేపథ్యంలోనే అనిత దూకుడు ఏపీ కేబినెట్లో ఇద్దరు లేడీ మంత్రులకు టెన్షన్ పెడుతోందట. స్వతహాగా టీచర్ అయిన ఆమెకు గత ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట సీటు రావడం..ఆమె గెలవడం అనూహ్యంగా జరిగిపోయాయి. తర్వాత అసెంబ్లీలో తనకు వీలున్నప్పుడల్లా మంచి వాగ్దాటితో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు త్వరలోనే జరిగే ఏపీ కేబినెట్ భారీ ప్రక్షాళనలో లేడీ మంత్రులు అయిన పీతల సుజాత, కిమిడి మృణాళినిలలో ఎవరో ఒకరిని పక్కన పెట్టి అనితకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ఆమె తమ పరిధి మంచి దూసుకెళుతోందని వీరిద్దరు తమ సన్నిహితుల వద్ద కాస్త టెన్షన్గానే ఉన్నట్టు ఏపీ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.