ఏ రంగంలో అయినా గెలుపు ఉన్న చోటే జనాలు ఉంటారు. రాజకీయాల్లో అధికారం ఉన్న చోట జనాలు ఎలా ఉంటారో…సినిమాల్లో సక్సెస్లు ఉన్న వాళ్ల చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుంది. అయితే ఇక్కడే మరో సూత్రం కూడా ఉంది. వచ్చిన ఛాన్సులను వాడుకోకపోతే గెలుపుకోసం వాళ్లు మరో గుర్రాన్ని వెతుక్కుంటారు. ఈ సూత్రం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్తరుణ్కు కరెక్టుగా వర్తిస్తుంది.
ఉయ్యాల జంపాల – సినిమా చూపిస్తా మావా – కుమారి 21 ఎఫ్ సినిమాలతో టాలీవుడ్లో రాజ్తరుణ్ క్రేజ్ ఒక్కసారిగా పీక్ స్టేజ్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈడో రకం -ఆడో రకంతో మరో హిట్ కొట్టాడు. తర్వాత చాలా పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే మనోడు కథలో కండీషన్లు, డైరెక్షన్లో వేలుపెట్టడం ఎక్కువైందన్న టాక్ ఇండస్ట్రీలో వచ్చేసింది. డైరెక్టర్ అవ్వాలనుకుని హీరో అయ్యాడు కాబట్టి సహజంగానే కథ, డైరెక్షన్పై కాస్తో కూస్తో ఐడియా ఉంటుంది.
దీనిని బేస్ చేసుకుని మనోడు కండీషన్లు పెడుతుండడంతో చాలా ప్రాజెక్టులు మిస్ అయిపోయాడు. మనోడు వదులుకున్న దిల్ రాజు ప్రాజెక్టు నాని చేతుల్లోకి వెళ్లిపోయింది. గీతా ఆర్ట్స్ సినిమా విజయ్ దేవరకొండకు వెళ్లిపోయింది. యూవీ క్రియేషన్స్లోను విజయ్ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని అనుబంధ సంస్ణ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , వారాహి బ్యానర్ ఇలా పెద్ద బ్యానర్లలో సినిమాలన్ని విజయ్ దేవరకొండ ఓకే చేసేశాడు.
ఇకప్పుడు ఈ పెద్ద బ్యానర్లు అన్నీ రాజ్ తరుణ్తో సినిమాలు చేయాలనుకున్నవే. అయితే ఆ ప్రాజెక్టుల్లోకి సడెన్గా విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు. రాజ్ ఇప్పటి వరకు పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేయలేదు. కానీ విజయ్ అప్పుడే పరశురాం – నందినిరెడ్డి లాంటి వాళ్లతో సినిమాలు చేసేస్తున్నాడు. ఏదేమైనా రాజ్ తరుణ్ ప్లానింగ్ తేడా కొడడంతో అతడికి వచ్చిన ఛాన్సులను విజయ్ అందిపుచ్చుకుని రాజ్కు ఆల్ట్రనేటివ్ అయిపోయాడన్న టాక్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది. రాజ్ ఇప్పుడు విజయ్తో పోల్చుకుంటే రేసులో వెనకపడిపోయినట్టే కనిపిస్తోంది.