పవన్‌కళ్యాణ్‌కి కుమారస్వామి నిర్మాత

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని కలిసి ముచ్చటించారు. అయితే ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడైన పవన్‌ కళ్యాణ్‌ని కుమార్‌ స్వామి కలవడం వెను రాజకీయ ఎత్తుగడ ఉన్నదని మీడియా మిత్రులు ఆశక్తి కనబరిచారు. కానీ కుమార స్వామి, పవన్‌ మీటింగ్‌ సారాంశం అది కాదనీ, కేవలం సినిమా విషయాలు మాత్రమే వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చాయని పవన్‌ వివరించారు. మరో పక్క కుమార్‌ స్వామి పవన్‌ని హీరోగా పెట్టి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అందుకోసం ఎప్పట్నుంచో టాలీవుడ్‌లో ఒక ప్రముఖ దర్శకుడితో మంతనాలు కూడా చేస్తున్నారని సమాచారమ్‌.

భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కించనున్నారట. అంతేకాదు కుమార్‌ స్వామి తనయుడు హీరోగా ‘జాగ్వార్‌’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని కుమార్‌ స్వామి స్వయంగా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్‌కి కూడా పవన్‌ సాయం కావాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. ఈ సినిమా ధియేటర్లోకి వచ్చిన తరువాత పవన్‌తో తాను చేయబోయే సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని చెబుతున్నారు కుమార్‌ స్వామి. ప్రస్తుతం పవన్‌ డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నారు. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఒక సినిమా చేయనున్నాడు పవన్‌ కళ్యాణ్‌.