తొలి సినిమాతోనే ఒక ప్రయోగం చేశాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. ‘జోష్’ లాంటి సందేశాత్మక చిత్రంతో ఎంట్రీ ఇచ్చి పరాజయం అందుకున్నాడు. యూత్ని ఆలోచింపచేసే ఈ సినిమాలో నాగచైతన్య తన నటవిశ్వరూపం చూపించినప్పటికీ అది అంతగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత ‘ఏ మాయ చేశావె’ సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. ఆ వెంటనే మాస్ సినిమాలు ట్రై చేసి మళ్లీ నిరాశపరిచాడు. అందుకే ఇప్పుడు మాస్ జోలికి పోకుండా మళ్లీ లవర్ బాయ్లా మారిపోయాడు. చైతూ హీరోగా వస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో లవ్ స్టోరీ మళయాళ రీమేక్ ‘ప్రేమమ్’లోనూ చైతూ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇలా రెండు క్యూట్ లవ్ స్టోరీస్తో వస్తోన్న నాగ చైతన్య ఇప్పుడు మరో రీమేక్తో ప్రయోగం చేయాలనుకుంటున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘ఈట్టి’ రీమేక్లో నటించాలనుకుంటున్నాడట. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన రవి అరసు ఈ తెలుగులో కూడా చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాకు చైతూ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. ఒక క్రీడాకారుణి కథా నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. ఈ సినిమా పట్ల చైతూ కూడా ఆశక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయి. మరో కొత్త హీరోయిన్కి కూడా చోటున్నట్లు సమాచారమ్.
ఇలా వరుస సినిమాలతో మంచి జోష్ మీదున్న చైతు తాజాగా సమంతతో ప్రేమ పెళ్లి వ్యవహారం కూడా ఓ కొలిక్కి రావడంతో చైతు సినీ వ్యక్తిగత జీవితంపైనే అందరి చూపు ఉంది.