సునీల్‌ తొందరపడుతున్నాడు

‘కృష్ణాష్టమి’ సినిమాతో నిరాశపడ్డాడు సునీల్‌. దాని నుంచి వెంటనే తేరుకుని వరుసగా రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఒకటి ‘జక్కన్న’, రెండోది ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాలు. శరవేగంగా ఈ సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెఢీ అయ్యాయి. అయితే ‘జక్కన్న’ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తారని ఎప్పుడో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు.

కానీ ఇంకా కన్నా ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాకి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ కాలేదు. వాస్తవానికి ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమా ఆగష్ఠు 12న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆగిపోయింది. దాంతో ‘ఈడు గోల్డ్‌ ఎహే’ టీం కొంచెం ముందుకు స్టెప్పు వేసి ఈ రిలీజ్‌ డేట్‌ని తమ కోసం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారట. వెంటనే ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాని ఆ డేట్‌కి అనౌన్స్‌ చేసేశారు.

మంచు విష్ణుతో ‘దూసుకెళ్తా’ సినిమాను తెరకెక్కించిన వీరూ పోట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్‌ డబుల్‌ రోల్‌ చేసినట్లు సమాచారం. అద్భుతమైన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. సునీల్‌ ఈ సినిమాలో సుష్మారాజ్‌, రీచా పనాయ్‌ అనే ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేస్తున్నాడు. ఏది ఏమైనా సునీల్‌ రెండు సినిమాలతో వరుసగా వస్తున్నాడు. సునీల్‌ అభిమానులకు ఇది సంతోషమైన విషయమే. హిట్‌ కోసం ఎదురు చూస్తున్న సునీల్‌కి ఈ సినిమాలతో హిట్‌ దొరకాలని ఆశిద్దాం.