రెజీనా సందీప్ కిషన్ జంట మధ్య కెమిస్ట్రీ అదరహో అనిపిస్తుంది.వీరిద్దరిది వెండి తెరపై హిట్ పెయిర్ అనిపించుకుంది.ఇద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.సందీప్ యూత్ ఫుల్ సినిమాలతో మంచి జోష్ మీదుండగా రెజీనా నటనతో పాటు అందచందాలను అన్లిమిటెడ్ గా ఆరబోస్తూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూ కుర్రకారుని హోరెత్తించేస్తోంది.
అయితే తాజాగా వీరిద్దరితో ఎ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ‘నగరం’ అని పేరు పెట్టారు.నాన్స్టాప్గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ని వచ్చేవారం రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ హాట్ హాట్ హిట్ పెయిర్ ఇప్పటికే రా రా కృష్ణయ్య సినిమాలో కలిసినటించారు.తాజాగా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న నక్షత్రం సినిమాలోనూ కలిసి నటిస్తున్నారు.నగరం సినిమాతో ముచ్చటగా మూడోసారి ఈ పెయిర్ తెరపై కనిపించనుందన్నమాట.