‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘క్యాంపస్–అంపశయ్య’.కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్యామ్కుమార్, పావని జంటగా నటించారు.
అయితే ఈ చిత్రంలో నగ్న దృశ్యాలున్నాయంటూ ఈ మధ్య వార్తలొచ్చాయి.దీనిపై దర్శకుడు స్పందిస్తూ ‘అందరూ ఆర్ట్ ఫిల్మ్ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్ ఫిల్మ్ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం’’ అని దర్శకుడు ప్రభాకర్ జైని అన్నారు.
‘నవలలో బోల్డ్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఆధారంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది. కథానుగుణంగా సహజత్వం కోసమే ఆ సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. పాత్రధారుల భావోద్వేగాలు మాత్రమే కనిపిస్తాయి అని దర్శకుడు ఈ వివాదం పై వివరణిచ్చే ప్రయత్నం చేసాడు.