సౌత్ లో రేంజ్ పెంచిన పరిణీతి

బాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉన్నా.. అక్కడి ముద్దుగుమ్మలు దక్షిణాది సినిమాల్లోకి వచ్చారంటే ఓ రేంజ్ ప్రదర్శిస్తుంటారు. ఈ స్థాయి రెమ్యూనరేషన్ లోనే తెలిసిపోతుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా ఇదే ఇష్యూతో వార్తల్లో నానుతోంది. ప్రిన్స్ మహేష్ బాబు సరసన తొలిసారి సౌత్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏఆర్ మురుగదాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ మూవీ బడ్జెట్ సుమారు రూ.100కోట్లు.

సాధారణంగా మహేష్ తో నటించడానికి హీరోయిన్లు ఓ అడుగు ముందే ఉంటారు. రెమ్యూనరేషన్ తో పనిలేకుండా ఆయన సరసన మెరిసేందుకు ఉత్సాహపడిపోతారు. పరిణీతికి ఈ విషయాలు తెలీదో లేక తెలిసో.. మొత్తానికి పారితోషకం వద్ద ఏమాత్రం తగ్గలేదు. రూ.4కోట్లకు ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకుంది.