సీటు రాకపోతే ఇండిపెండెంట్..టీడీపీ-జనసేనలో కొత్త రచ్చ.!

టీడీపీ-జనసేన పొత్తు కొత్త సమస్యకు దారి తీసేలా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు కానీ..కింది స్థాయిలో రెండు పార్టీల శ్రేణులు ఎంతవరకు కలుస్తాయి. ఎంతవరకు సహకరించుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. సీటు తమకంటే తమకని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ఒక పార్టీకి సీటు దక్కితే మరొక పార్టీ నేత ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు కూడా […]

పుంగనూరు కేసులు..చల్లా-నల్లారిపైనే గురి..వైసీపీకి ప్లస్సేనా?

ఇటీవల చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో తంబళ్ళపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ, టి‌డి‌పి శ్రేణుల మధ్య దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే టి‌డి‌పి శ్రేణులని బాబు రెచ్చగొట్టి..వైసీపీ, పోలీసులపై దాడులు చేయించారని చెప్పి వైసీపీ నేత కేసు పెట్టగా, చంద్రబాబుతో సహ టి‌డి‌పి నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ రెండు చోట్ల ఏం జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. మొదట తంబళ్ళపల్లెలో బాబు టూర్ ఉంటే..వైసీపీ శ్రేణులు ఎందుకు […]

టీడీపీలోకి శ్రీదేవి..సీటుపై ఆశలు లేనట్లే.!

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..టీడీపీలో చేరడం ఖాయమైంది. తాజాగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిశారు. మొన్న ఆ మధ్య వైసీపీ శ్రేణులు తనపై మాటల దాడి చేయడం, తన పార్టీ ఆఫీసులపై దాడి చేసినప్పుడు చంద్రబాబు, లోకేష్ తనకు మద్ధతుగా నిలించారని అందుకే కృతజ్ఞత తెలుపుకోవడానికి బాబుని కలిశానని శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఆలోచించుకున్నానని, ఏపీలో టి‌డి‌పి హవా ఉందని, టి‌డి‌పితోనే న్యాయం జరుగుతుందని, అందుకే యువగళం […]

గోదావరి జిల్లాలపైనే జగన్ గురి..వైసీపీకి ఆధిక్యం?

గోదావరి జిల్లాలు..రాజకీయంగా ఈ జిల్లాల్లో పట్టు సాధించిన పార్టీకి తిరుగుండదు. ఈ జిల్లాల్లో ఆధిక్యం సాధిస్తే అధికారం దక్కించుకోవడం సులువే. ఎందుకంటే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉంటాయి. తూర్పులో 19, పశ్చిమలో 15 సీట్లు ఉన్నాయి. ఈ 34 సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి రావడం సులువే. 2014లో ఈ జిల్లాల్లో టి‌డి‌పి ఆధిక్యం దక్కించుకుంది. 2019లో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. 34 సీట్లకు 27 […]

చిరు టార్గెట్‌గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!

జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బి‌జే‌పి అధ్యక్షురాలు […]

టీడీపీ కోటని కూల్చనున్న వైసీపీ..తొలిసారి ఇలా.!

గత ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయం సాధించిన..ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంతవరకు వైసీపీ జెండా ఎగరలేదు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే టి‌డి‌పి కంచుకోటలుగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టి బలం పెంచుకుంటూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కొన్ని టి‌డి‌పి కంచుకోటలని వైసీపీ కూల్చే అవకాశాలు […]

సీమలో టీడీపీకి ఒకటే..వైసీపీ తగ్గట్లేదు.!

రాయలసీమ అంటే రాజకీయంగా వైసీపీ అడ్డా అని చెప్పవచ్చు. రాష్ట్రంలో పరిస్తితులు ఎలా అయిన ఉన్నా సీమలో మాత్రం వైసీపీ హవానే ఉంటుంది. అంటే సీమపై వైసీపీకి ఉన్న గ్రిప్ అలాంటిది. అలాగే అక్కడ రెడ్డి సామాజికవర్గం ఎక్కువ..దీంతో అంతకముందు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇలా సీమపై పట్టు ఉండటంతోనే గత ఎన్నికల్లో వైసీపీ 52 సీట్లకు 49 సీట్లు గెలుచుకుంది. అటు 8 ఎంపీ సీట్లని గెలుచుకుంది. ఇలా వైసీపీ సత్తా చాటింది. […]

టార్గెట్ 36: వైసీపీకి ‘రిజర్వ్’లో లీడ్.!

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మొదట నుంచి రాజకీయంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములని శాసించగలరు. కేవలం రిజర్వ్ సీట్లలోనే కాకుండా.ఇంకా కొన్ని సీట్లలో సత్తా చాటగలరు. అయితే మొదట నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా ఉండేవి. అప్పుడప్పుడు టి‌డి‌పికి మద్ధతుగా నిలిచేవి. కానీ మెజారిటీ మాత్రం కాంగ్రెస్‌కే ఉండేది. అయితే కాంగ్రెస్ దెబ్బతినడంతో వైసీపీకి మద్ధతు ఇస్తూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు. […]

సీమలో ఆధిక్యం మారింది..కానీ వైసీపీదే హవా!

రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట..అందులో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ ప్రతి జిల్లాలో వైసీపీకి పట్టు ఉంది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి బలం ఎక్కువే. ఇక గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి. కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేయగా, చిత్తూరులో 14 సీట్లకు 13, అనంతలో 14 సీట్లకు 12 సీట్లు […]