ప‌వ‌న్ ఉద్దానం టూర్‌కు టీడీపీ ఎమ్మెల్యే సాయం

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇటీవ‌ల శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్ర‌భుత్వం ఏదైనా చేయ‌క‌పోతే తాను ప్ర‌జా ఉద్య‌మాన్ని లేవ‌దీసి…దానిని తానే స్వ‌యంగా లీడ్ చేస్తాన‌ని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ శ్రీకాకుళం పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సాయం చేసిన‌ట్టు వార్త‌లు రావ‌డం ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచ‌ల‌న‌మైంది. ఈ వార్త‌లు అధికార పార్టీలో పెద్ద క‌ల‌క‌లం రేపాయి. […]