ఇప్పటికే కోర్టుల్లో లక్షలాది సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి కక్షిదారులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. ఆ కేసులను పరిష్కరించేందుకు న్యాయమూర్తులు నానా అవస్థలు పడుతున్నారు. అనేక మార్గాల ద్వారా వాటిని పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసరమైన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ కోర్టుకు కొత్త చిక్కులు పెడుతున్నారు. ఇలాగే నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్కు హైకోర్టు రూ.10 వేలు […]