క‌ర్నూలులో మొద‌లైన టికెట్ లొల్లి

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ టీడీపీ నాయ‌కుల్లో ఉన్న‌వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఎన్నికల బరిలో ఉంటామని ఒకరు.. అభ్యర్థి నేనే అంటూ మరొకరు ప్రకటన చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన‌ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా ఉన్న క‌ల‌హాలు.. ఇప్పుడు బ‌య‌ట‌ప‌డు తున్నాయి. ముఖ్యంగా ఆయా నేత‌ల వార‌సులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు దుమారం రేపుతున్నాయి. క‌ర్నూలు జిల్లాలో టీజీ, ఎస్వీ వ‌ర్గాల మ‌ధ్య క‌ల‌హాలు ఇప్పుడు సీఎం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు తీసుకొస్తున్నాయి. […]