పార్టీలో యువశక్తిని బలోపేతం చేసేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. అందుకు ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న తెలుగు యువత అధ్యక్ష పదవిని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ.. తనయుడు అవినాశ్కు ఈ పదవిని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్కు.. అవినాశ్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే తన సొంత వర్గాన్ని తయారుచేసుకునే పనిలో చినబాబు కూడా నిమగ్నమై ఉండటంతో.. ఇక అవినాశ్ ఎంపిక లాంఛనమే […]