సమర్థత, సీనియారిటీతో పాటు సామాజిక వర్గం కూడా ఎమ్మెల్సీ ఎంపికలో కీలక పాత్ర పోషించింది. ఈ విషయం డొక్కా మానిక్య వర ప్రసాద్ ఎంపికలో స్పష్టంగా కనిపించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఆశించిన సీనియర్ నేత పుష్పరాజ్ తీవ్రంగా భంగపడ్డారు! ఏకంగా సీఎంపైనే విమర్శలు చేసినా.. సీనియారిటీ కోటాలో తనకు ఎమ్మెల్సీ తప్పదని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆయన్ను ఎంపిక చేయకపోవడానికి, డొక్కాను ఎంపిక చేయడానికి వారి కులమే ప్రధానమనేది […]