పద్మనాభం.. ఒకప్పటి గొప్ప హాస్య నటుడు. అంతేకాదు.. అద్భుత దర్శకుడు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. రేఖా అండ్ మురళి కంబైన్స్ బ్యానర్పై ఆయన నిర్మించిన తొలి సినిమా క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమా మరేదో కాదు.. దేవత. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించారు. ఈ సినిమాను కె. హేమాంబరధరరావు తెరకెక్కించాడు. ఈ సినిమాలో కన్నుల్లో మిసమిసలు అనే పాట బాగా హిట్ అయ్యింది. ఈ పాటను ఔట్ డోర్ లో షూట్ చేశారు. […]