చెప్పులు, చీపురు మైలేజ్ ఎంత!!

ఇటీవల రైతు భరోసాయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన మాటలవేడి పెంచి రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపారు. సిఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని సిఎంను చెప్పులతో, రాళ్లతో కొట్టండి అని విమర్శలు గుప్పించారు. దీనిపై టిడిపి నేతలు ప్రతిదాడికి చేయగా ఇంకా ఒక అడుగు ముందుకేసిన జగన్మోహన్‌రెడ్డి చెప్పులు, రాళ్లతో కొడితే బాగోదటా అందుకే మీరు చీపురు చూపండి అని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. […]