కర్నూలు జిల్లా రాజకీయాలు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారాయి. ఇటీవలె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో ఇక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. భూమా మృతి తర్వాత.. నంద్యాలలో పూర్తి పట్టు సాధించాలని భావిస్తున్న శిల్పా వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో భూమా వర్గానికి సీటు కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని స్పష్టమవుతోంది. ఈ పరిణామంతో […]