ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమలో ఎంతోమంది చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాకుండా ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలు కరోనా దాటికి ప్రభావితం కాగా ఎక్కువగా నష్టపోయింది మాత్రం బాలీవుడ్డే. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ రావడానికి ముందు కొంచెం గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్ ను బాలీవుడ్ ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయింది. ఈ ఏడాదిలో మహారాష్ట్రలో ఎప్పుడూ థియేటర్లు పూర్తిస్థాయిలో నడవలేదు. అయితే కరోనా […]
Tag: second wave
ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదట..ఎందుకంటే..?
ప్రస్తుతం కరోనా రెండో వేవ్ వేగంగా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆస్తమా రోగులకు చేప మందుని పంపిణీ చేయడం లేదని తాజాగా బత్తిని హరినాథ్గౌడ్ తెలియచేసారు . 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం ప్రతి ఏడాది అందిస్తున్న చేప ప్రసాదాన్ని గత సంవత్సరం కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేక పోతున్నాము అని అన్నారు. మృగశిరకార్తె రోజున ప్రతి సంవత్సరం లానే జూన్ 7వ తేదీన దూద్బౌలిలోని తమ నివాసం దగ్గర సత్యనారాయణ ప్రత్యేక […]
కరోనా వైరస్ వల్ల ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్..!
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ బారిన పడి ఎందరో చనిపోతున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు విందులు, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు పై నిషేధం విధించాయి. చివరికి ఐపీఎల్ లాంటి టోర్నీలను కూడా ప్రేక్షకులు లేకుండానే జరిగిపోతున్నాయి. ఇలాగే గత సంవత్సరం జరుగాల్సి ఉన్న, టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడింది. కానీ ఈసారి కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకులు లేకుండానే జరపనున్నారని సమాచారం. ఈ విషయాన్ని టోక్యో […]
మనమంతా ఆ విషయంలో విఫలం అయ్యాము అంటున్న టాలీవుడ్ హీరోయిన్..!?
కరోనా వైరస్ సెకండ్ వేవ్ అతి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అంతగా బాగా లేకపోవడంతో యాక్టర్స్ అందరూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ రోజు కూలీలు, సినిమా మీద ఆధారపడి జీవించే సినీ కార్మికుల గురించి ఆలోచిస్తుంటే చాలా బాధ వేస్తుంది. నా గుండె బరువెక్కుతోందని రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగానికి లోనైయింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో షూటింగులు క్యాన్సిల్ అయ్యి వాయిదా […]
భారత్లో కరోనాపై సీసీఎంబీ సంచలన ప్రకటన
భారత్లో కరోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్కు కీలకమని.. వైరస్ […]
ఈసీ కి కీలక సూచనలు ఇచ్చిన మమతా..!?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ రాత్రి పూట కర్ఫ్య ఇంకా వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ […]
కరోనా ఉధృతి.. బేగంబజార్ మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24గంటల్లో హైదరాబాద్- 398, మేడ్చల్- 214, రంగారెడ్డి- 174, నిజామాబాద్-169, నిర్మల్-100, జగిత్యాల-99, కరీంనగర్-77, వరంగల్ అర్బన్- 74, సంగారెడ్డి- 65, మహబూబ్ నగర్-60, కామారెడ్డి- 58, మంచిర్యాల- 57, నల్గొండ- 54, ఖమ్మం-50 కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో 2,055 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అదే సమయంలో కరోనాతో […]
భారత్కు విమాన సర్వీసులపై న్యూజిలాండ్ కీలక నిర్ణయం..!
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజే లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదవడం ఆందోళనను రేకేత్తిస్తున్నది. కరోనా మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా 1,29,28,574 కేసులు నమోదుకాగా, ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసుల జాబితాలో మన దేశం మూడో స్థానంలో నిలవడం శోచనీయం. యాక్టివ్ కేసులు మళ్లీ […]
మరోకసారి ముంచుకోస్తున్న కరోనా ముప్పు ..!?
ప్రపంచ వ్యాప్తంగా మళ్ళి కరోనా వ్యాప్తి చెందుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కూడా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పుడు 69.23 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఫ్రాన్స్లో అత్యధికంగా 43.2 లక్షల మంది కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. బ్రెజిల్లో 12.78 లక్షలు, బెల్జియంలో 8.07 లక్షల యాక్టివ్ కేసులు , ఇటలీలో యాక్టివ్ కేసులు 5.63 లక్షలు వేలకు చేరుకుంది. ఇక పోతే […]