సికింద్రాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మోండా మార్కెట్ వద్ద దారుణం జరిగింది. ఆ ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో రైలు పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెట్రోరైల్ పిల్లర్ వేయడానికి ఆ ప్రాంతంలో గుంత తీశారు. అయితే, అటువైపుగా వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ అందులో పడ్డాడు. దీనిని గమనించిన మెట్రోరైలు సిబ్బంది, స్థానికులు బాలుడిని వెలికి తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడు. బోయినపల్లిలోని చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు […]