ప్రతిపక్ష నేత జగన్ మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రధాని మోడీని ఢిల్లీలో కలిసిన నాటి నుంచి ప్రతిపక్ష నేత జగన్ వ్యవహారశైలిపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటూ ఆయన మొండిగా ముందుకు వెళుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి ఇది మరింత ఎక్కవైందని రాజకీయవర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి రామనాథ్ కోవింద్ను జగన్ ఏపీలో కాకుండా తెలంగాణలో కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. […]