ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన గెలుపు నల్లేరుపై నడకేననేది తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఖాళీ అయిన వెంకయ్యనాయుడు రాజ్యసభ సీటు కోసం అప్పుడే లొల్లి మొదలైంది. ఈ సీటును నాకు కేటాయించండి అంటే .. నాకు కేటాయించండి .. […]