వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేసీ సోదరులు.. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వారసులను రంగంలోకి దించే పనిలో నిమగ్నమైన వారు.. అందుకు మార్గం సుగమం చేశారు! అనంతపురం రాజకీయాలను ఏళ్లుగా శాసిస్తున్న వీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి స్థానంలో తమ తనయులను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టబోతున్నారు. ఇప్పుడు జేసీ బ్రదర్స్కు సరికొత్త అర్థాన్ని ఇవ్వబోతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దివాకర్ […]