నంద్యాలలో పసుపు జెండా రెపరెపలాడించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇది తమ నియోజకవర్గమని, నాయకులు వెళ్లినా క్యాడర్ మాత్రం తమ వైపే ఉందని.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. తమ అభ్యర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బలంగా ఉన్న శిల్పామోహన రెడ్డిని ప్రకటించడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కేవలం సెంటిమెంట్ను నమ్ముకునే బరిలోకి దిగుతున్నామన్న అపవాదు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిలలు ప్రకటిస్తున్నారు. నిధులు, […]