రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఇటలీ బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, టి సిరీస్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. […]