కాషాయదళంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్నది. ఇప్పటికే పలువురు సీనియర్, జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు సైతం వైరస్ బారిన పడ్డారు. అందులో కొందరు కోలుకోగా, మరికొందరు ప్రాణాలను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన పడి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]