ఏపీలో నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు రాజకీయంగా ఒక్కడే పెద్ద చర్చ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్.జగన్ బీజేపీతో పొత్త అంశం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందని అందరూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. […]