టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్రజలకు కొంతమంది తెలుగుదేశం ఎంపీలు శఠగోపం పెడుతున్నారు. పార్టీని, ప్రజలను పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తలయిన వీరు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం తమ పరిశ్రమల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యాపారాలు, వ్యక్తిగత సమస్యలను పట్టించుకుని.. ప్రజలను, పార్టీని పూర్తిగా విస్మరించారని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు చేరువకాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో […]