రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడపై అటు టీడీపీ, ఇటు వైసీపీ పూర్తిగా దృష్టిసారించాయి. ఇక్కడ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ దృఢంగా నిశ్చయించుకున్నారు. అంతేగాక ఇప్పటి నుంచే ఇందుకు తగిన వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రెండేళ్ల ముందుగానే అభ్యర్థులను ఖరారుచేయాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటినుంచే వారికి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించి.. ఎలాగైనా విజయవాడలో క్లీన్ […]