రాయలసీమలోని కర్నూలు జిల్లాలో గత దశాబ్దంన్నర కాలంగా టీడీపీ అష్టకష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ గాలిలో 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ దూకుడుతో టీడీపీ కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. పత్తికొండ నుంచి సీనియర్ రాజకీయ దిగ్గజం కేఈ.కృష్ణమూర్తి, బనగానపల్లి నుంచి బీటీ.జనార్థన్రెడ్డి, ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర్రెడ్డి విజయం సాధించారు. వైసీపీ 11 ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు, […]