తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒకేసారి ఏకంగా 10 కార్పొరేషన్లకు చైర్మన్లను భర్తీ చేసింది. ఈ 10 మంది చైర్మన్లలో 5 గురు మైనార్టీ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. అయితే ఈ నియామకాల పట్ల టీఆర్ఎస్లో పెద్ద ముసలం మొదలైంది. వీరిలో చాలా మంది పార్టీ కోసం కష్టపడని వారితో పాటు అనామకులకు పదవులు కట్టబెట్టారని ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన వారంతా తీవ్రస్థాయిలో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారని తెలుస్తోంది. కొందరు మంత్రులైతే ఏకంగా […]
Tag: K Chandrashekarrao
కోదండరాంకి రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్ …!
తెలంగాణ ఉద్యమ పోరులో తనకంటూ ఓ అధ్యాయాన్ని సొంతం చేసుకున్న ఉస్మానియా ప్రొఫెసర్ కోదండ రాం.. ఉద్యమ సమయంలో మేధావులను కదిలించిన తీరు నభూతో.. ! అయితే, నాటి ఉద్యమ నేతల్లో చాలా మంది కేసీఆర్ పంచన చేరి పదవుల్లో విలాస జీవితాలు గడుపుతుంటే.. కోదండరాం మాత్రం ప్రజల పక్షాన ఇంకా పోరాడుతూనే ఉండడం నిజంగా హర్షణీయం. ఇటీవల కాలంలో ఆయన ఊహించని విధంగా కేసీఆర్పై ఉద్యమ బావుటా ఎగరేశారు. మల్లన్నసాగర్ నిర్వసితులు, రైతులు, రీయింబర్స్మెంట్, సీఎం […]
తెలంగాణలో సీఎం క్రేజ్ డౌన్ ఫాల్స్ వెనక..?
తెలంగాణ ఉద్యమంతో దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసుకున్న ఏకైక నేత కేసీఆర్. తెలంగాణ ఆవిర్భవిస్తే.. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా చేస్తానంటూ ఆయన చేసిన సంచలన ప్రకటన దేశంలోని రాజకీయవర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. ఇంత వరకు అలాంటి ప్రకటన ఏ ఒక్కరూ చేయకపోవడమే కారణం. అయితే, యధాలాపంగా ఆయనే సీఎం సీటును అలంకరించారు. ఈ పరిణామం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగానే తాను సీఎం కావాల్సి వచ్చిందని […]
మైహోం చేతికి భద్రాద్రి పాలనా పగ్గాలు
తెలంగాణలో తిరుమలలా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి జిల్లా సీతారామచంద్రమూర్తి ఆలయం(భద్రాద్రి ఆలయం) పాలనా పగ్గాలు త్వరలోనే మై హోం వ్యవస్థాపకుడు జూపల్లి రామేశ్వరరావుకు అందనున్నాయట! ఆయనను చిన జీయర్ స్వామి సిఫార్సు చేశారని, దీనికి సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆమోదించారని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడ నున్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా రంగు పులుము కుంటుండడం గమనార్హం. ఎంతో మందిని కాదని రామేశ్వరరావుకు ఈ పోస్టు అప్పగించడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జూపల్లి […]