ఎలమంచిలి జనసేనకే..కానీ అదొక్కటే డౌట్.!

టీడీపీ-జనసేన పొత్తుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ అనధికారికంగా రెండు పార్టీల శ్రేణులు పొత్తు ఫిక్స్ అయిపోయాయి. దాదాపు పొత్తు ఖాయమైనట్లే…ఇంకా ఆ రెండు పార్టీలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే. టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో సీట్ల గురించి చర్చ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇదే క్రమంలో విశాఖలో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల […]

ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]

పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ వచ్చినట్లేనా….!

రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీని ఓడించాలనేది తెలుగుదేశం, జనసేనా పార్టీల ఏకైక లక్ష్యం. అందుకు తగినట్లుగానే దాదాపు రెండేళ్లుగా ఈ రెండు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. గతానికి భిన్నంగా చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే మకాం వేశారు. సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప…. పూర్తి సమయంలో పార్టీకే కేటాయిస్తున్నారు పవన్. ఇక టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మాజీ […]

పొత్తులో ఎత్తులు..టీడీపీ మునిగేది అక్కడే.!

ఏదో అనుకుంటే..ఇంకేదో జరిగేలా ఉంది..టి‌డి‌పి పొత్తుల కోసం ముందుకెళ్లడం. ఏపీలో జగన్‌ని ఓడించి అధికారం దక్కించుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడ కూడా టి‌డి‌పికి బలపడే అవకాశం దక్కడం లేదు. కొద్దో గొప్పో బలపడిన వైసీపీని దాటలేని పరిస్తితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు..పొత్తుల కోసం చూస్తున్నారు. ఇప్పటికే పవన్ తో కలిసి ముందుకెళుతున్నారు. అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు..కానీ దాదాపు జనసేన-టి‌డి‌పి పొత్తు ఫిక్స్ అని చెప్పవచ్చు. దీని వల్ల ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ […]

కైకలూరుపై జనసేన గురి..టీడీపీ వదులుకున్నట్లే.!

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టి‌డి‌పికి ఇంకా ఇంచార్జ్‌లు లేరు..ఆ సీట్లని వ్యూహాత్మకంగా చంద్రబాబు వదిలేశారా? జనసేనకు ఇవ్వడం కోసం ఖాళీగా ఉంచారా? అనే ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటులో టి‌డి‌పి ఇంచార్జ్ ఎవరు లేదు. మొన్నటివరకు ఇంచార్జ్ గా పనిచేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి […]

రాధా మళ్ళీ బరిలో లేరా? బాబు ప్లాన్ ఏంటి?

విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ లో ఉన్న ట్విస్ట్‌లు ఇంకా ఎవరికి ఉండవనే చెప్పాలి. అసలు ఆయన రాజకీయంగా ఎటు వైపు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది క్లారిటీ ఉండటం లేదు. 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు..2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టి‌డి‌పిలో చేరారు. కానీ అప్పుడు పోటీ చేయలేదు. టి‌డి‌పి కోసం ప్రచారం చేశారు. అటు టి‌డి‌పి ఓడిపోయి అధికారానికి […]

టీడీపీ-జనసేనలో సీట్ల కోసం వైసీపీ నేతల పోటీ?

టీడీపీ-జనసేనల్లో సీట్లు దక్కించుకోవడం కోసం వైసీపీ నేతలు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది..దానికి ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి మంచి సమాధానమే ఇచ్చారు. వైసీపీలో పోటీ ఎక్కువైంది..సీట్లు దక్కించుకోవాలని చాలామంది చూస్తున్నారు. గెలిచే పార్టీ కాబట్టి..ఒకో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే అందరికీ సీటు ఇవ్వలేము కాబట్టి..ఒకరికి సీటు ఇచ్చి..మిగిలిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నామని, సీటు కోసం పట్టుబట్టే వారు..ఏ పార్టీ అయితే ఏముందితో సీటు కావాలని..వేరే […]

ఆ ఇద్దరి మధ్య… పొత్తు ఉన్నట్లా… లేనట్లా…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే పుకార్లతో పాటు అధికార వైసీపీ నేతలు సైతం అభ్యర్థుల ప్రకటన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తుండటంతో… ముందస్తు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే […]

కొత్తపేటపై లొల్లి..జనసేనకు టీడీపీ షాక్.!

అటు టీడీపీకి, ఇటు జనసేనకు బలం ఉండి..వైసీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న కొత్తపేటలో రాజకీయం ఇప్పుడు వాడివేడిగా సాగుతుంది. ఇటీవలే ఇక్కడ పవన్ పర్యటించి వెళ్లారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పర్యటించారు. ఇద్దరు నేతలు వైసీపీనే టార్గెట్ చేశారు. చంద్రబాబు కొత్తపేటలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇసుక ర్యాంప్‌ల వద్ద సెల్ఫీలు కూడా దిగారు. ఇక రావులపాలెం సెంటర్ లో భారీ సభ ఏర్పాటు చేశారు.అయితే అంతా బాగానే ఉంది. కానీ […]