గత ఎన్నికల్లో విజయానికి అడుగు దూరంలో నిలిచిపోయిన వైసీపీని ఈసారి ఎలాగైనా విజయతీరాలకు చేర్చాలని పార్టీ అధినేత జగన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏరికోరి ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని మైలేజ్ ఉన్న ప్రశాంత్ కిశోర్ను పక్కనపెట్టుకున్నారు. ఆయన రాకతో వైసీపీకి తిరుగులేదని నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అందుకు తగినట్టే ఆయన పని మొదలుపెట్టేశారు. సంప్రదాయాలకు భిన్నంగా సరికొత్త పంథాలో వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గ్రామాల్లో సర్వేలు, ఎమ్మెల్యేలకు శిక్షణ శిబిరాలు, మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా […]