ఏపీలోని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనన్న విషయాన్ని ఇప్పటికే సూచనాభిప్రాయంగా వెల్లడించేశారు. వయోభారం రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనుకుంటోన్న మురళీమోహన్ తాను తప్పుకుని ఆ స్థానంలో తన కోడులు రూపాదేవిని అక్కడ నుంచి 2019లో ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. మురళీమోహన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ పేరును […]