ఫ్లయింగ్ సిఖ్గా పేరొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి చెందారు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. నెలరోజుల పోరాటం తర్వాత చండీగడ్లోని పిజిఐ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. దీంతో మిల్కాసింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గొప్ప క్రీడాకారుని […]