ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. తెలంగాణలో మనుగడ సాధించడానికి అవస్థలు పడుతోంది. ఆ పార్టీకి చెందిన నాయకులంతా గులాబీ కండువా కప్పేసుకోవడంతో నాయకులు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు వైసీపీలో జోష్ నింపే పరిణామం జరిగింది. ఆపరేషన్ ఆకర్ష్తో పార్టీనుంచి వెళ్లిపోయిన నేతలు.. మళ్లీ సొంతగూటికి వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ స్తబ్ధుగా ఉన్న వైసీపీకి కొత్త ఉత్తేజం వచ్చినట్టయింది. ఇదే సమయంలో టీఆర్ఎస్లో ఇమడలేకపోయిన వారు మరికొందరు బయటికి వస్తారేమో […]