టీడీపీలో కోటి రూపాయ‌ల చిచ్చు…అస‌లు క‌థ ఇదే

ఏపీలో అధికార టీడీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావ‌రి జిల్లా ఒక‌టి. ఇప్పుడు ఈ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడి ఎంపిక పెద్ద స‌స్పెన్స్‌లో ప‌డింది. ఈ స‌స్పెన్స్ వెన‌క ఓ కోటి రూపాయ‌ల ఆస‌క్తిక‌ర క‌థ ఉన్న‌ట్టు జిల్లా టీడీపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా నామ‌న రాంబాబు ఉన్నారు. ఈయ‌న హోం, ఉప ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప అనుంగు అనుచ‌రుడు. రాంబాబును జ‌డ్పీచైర్మ‌న్ చేయ‌డంలో రాజ‌ప్ప‌దే కీల‌క‌పాత్ర‌. ఇదిలా ఉంటే […]

గోదావరి జిల్లాల్లో చేతులు ఎత్తేసిన వైసీపీ

తూర్పుగోదావ‌రి జిల్లాలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న వైసీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ముఖ్యంగా రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌క‌త్వ స‌మ‌స్య‌లు పార్టీని వెంటాడుతున్నాయి. కీల‌క నేత పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్ నాయ‌క‌త్వంపై శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నాయి. ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఎంపిక‌, సొంత సామాజిక‌వ‌ర్గం గ‌ల వార్డుల్లో ఓట‌మి చెంద‌డం.. ఇవ‌న్నీ ఆయ‌న నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి. ఇక వైసీపీలో పిల్లి బోస్ ప‌ని అయిపోయింద‌నే వార్తలు గుప్పుమంటున్నాయి. మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్‌ శల్యసారథ్యంలో స్వంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ […]

ఆ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా లోకేష్ పోటీ..!

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భాగం చేయడానికి మరో ముందడుగు పడింది. లోకేష్‌ను మంత్రిని చేయ‌డం దాదాపు ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే లోకేష్‌ను ఎమ్మెల్యేల కోటాలో మండ‌లికి పంపుతార‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం లోకేష్‌ను ఓ జిల్లా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీకి పంపాల‌ని డిసైడ్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏపీలో టీడీపీ తిరుగులేని […]

టీడీపీ కంచుకోట‌పై జ‌న‌సేన గురి

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తీసుకున్న నిర్ణ‌యం ఏపీ పాలిటిక్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ప‌వ‌న్ కేవ‌లం ఓటు హ‌క్కు మాత్ర‌మే ఏలూరులో న‌మోదు చేయించుకున్న‌ట్టు పైకి క‌నిపించినా దీని వెన‌క అనేక రాజ‌కీయ కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ ఏలూరు నివాసం ఉండేందుకు త‌న‌కు అనువైన భ‌వ‌నం చూడాల‌ని కూడా కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఈ వ్యూహం వెన‌క టీడీపీ కంచుకోట‌ను టార్గెట్ చేసినట్టు […]