ఆర్‌కె.న‌గ‌ర్ బ‌రిలో మ‌హామ‌హులు…ర‌స‌వ‌త్త‌రంగా బై ఎల‌క్ష‌న్‌

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక కోసం అధికార‌, ప్ర‌తిప‌క్షంతో పాటు బీజేపీ నుంచి మ‌హామ‌హులు రంగంలో ఉండ‌నున్నారు. దీంతో గెలుపోట‌ముల‌పై ఎవ్వ‌రూ అంచ‌నాల‌కు రాలేక‌పోతున్నారు. అధికార అన్నాడీఎంకే నుంచి పార్టీని తెర‌వెన‌క ఉండి అంతా న‌డిపిస్తోన్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన […]