కొవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నది. ఊపిరాడనివ్వడం లేదు. రెండో దఫాలో చాలా మంది శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో, ముఖ్యంగా ఆక్సిజన్ అందకనే ప్రాణాలను కోల్పోతుండడం విచారకరం. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొవిడ్ బాధితులు ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికే అనేక వైద్యశాలల్లో ఆక్సిజన్ కొరత నెలకొన్నది. కేంద్రం సైతం ఆగమేఘాల మీద ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నది. అయినప్పటికీ సకాలంలో ఆక్సిజన్ అందక రోగులు విగతజీవులుగా మారుతున్నారు. […]