ఉచిత విద్యుత్‌ని కవర్ చేసిన కారు..కాంగ్రెస్ సక్సెస్.!

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పోరు నడుస్తుంది. ముఖ్యంగా కే‌టి‌ఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు యుద్ధం నడుస్తుంది. అయితే అమెరికాలో ఉండగా రేవంత్..3 ఎకరాలు నీరు పెట్టడానికి 3 గంటలు సరిపోతుందని, సరాసరినా రోజుకు 8 గంటల చాలు అని అన్నారు. 24 గంటల కరెంట్ వద్దని చెప్పలేదు. కానీ అదిగో […]

కేటీఆర్ వర్సెస్ రేవంత్..ప్రజలు ఎటువైపు.!

తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తూనే ఉంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత  అని చెప్పి కనీసం 12 గంటల కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటుంది. ఈ మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్లుకు వెళ్ళి..24 గంటలు రావడం లేదని రుజువు చేశారు. ఇదే క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి..3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు అని, మొత్తం మీద 8 గంటలు […]

కారు-కాంగ్రెస్ మధ్యే పోరు…కమలం సింగిల్ డిజిట్‌తోనే.!

ఈ సారి కూడా తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోరు నడవనుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో అదే మాదిరిగా పోరు జరిగింది. కాకపోతే  కారుకు..కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బి‌ఆర్‌ఎస్ పార్టీ వన్‌సైడ్‌గా గెలిచింది. కానీ ఈ సారి ఎన్నికలు అలా ఉండవని కారుకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందని తేలింది. అయితే మొన్నటివరకు రేసులో కనిపించిన బి‌జే‌పి మాత్రం..ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయింది. […]

రేవంత్ లాజికల్ కౌంటర్స్..బీఆర్ఎస్‌కు చిక్కులు.!

తెలంగాణ రాజకీయాల్లో అధికార బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రమైంది. ఇదే క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మరింత ఊపులో ఉంది. వలసల జోరుతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ చెక్ పెట్టేస్తుందనే కోణంలో రాజకీయం వస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి..అమెరికా లో ఉచిత […]

సీతక్క సీఎం అంటున్న రేవంత్..సీనియర్లు గుస్సా.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం…సీనియర్ల వర్గానికి పెద్దగా పడని విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు రచ్చ కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ బలపడటంతో కాస్త విభేదాలు ఆగాయి. అయినా సరే లోలోపల రేవంత్ అంటే సీనియర్లు రగులుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తాజాగా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్..సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందని చెప్పవచ్చు. తాజాగా తానా సభలకు రేవంత్ అమెరికా […]

బీజేపీలో ఆగని లొల్లి..కాంగ్రెస్ వైపే ఆ నేతల చూపు.!

తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీలోకి ఇంకా జంప్ అవ్వడానికి నేతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగిన విషయం తెలిసిందే.బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు పెద సంఖ్యలో కాంగ్రెస్ లోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటంతో…బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లోకి వలసలు నడుస్తున్నాయి. ఇటు బి‌జే‌పి పరిస్తితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ బలం ఊహించని […]

రాహుల్‌కు కౌంటర్లు..రేవంత్ తగ్గట్లేదు.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో పాటు 50 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు..రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇక బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పి బీటీమ్ అంటూ విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పలు హామీలని ప్రకటించింది. ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చి దూకుడు మీద ఉంది. […]

రాహుల్‌తో హస్తం జోరు..కేసీఆర్‌ని నిలువరిస్తారా?

మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ పార్టీలో జోరు పెరిగింది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఆ పార్టీకి కొత్త చేరికలు భారీ ప్లస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు…కాంగ్రెస్ లోకి రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఖమ్మంకు రాహుల్ గాంధీ వచ్చారు. ఖమ్మంలో జరిగిన సభలో […]

ఖమ్మంకు రాహుల్..కాంగ్రెస్‌లో రచ్చ మొదలు.!

అంతా బాగుదనుకునే సమయంలో ఏదొక చిచ్చు చెలరేగడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా మారిపోయింది. ఆ పార్టీ ఇప్పుడుప్పుడే సెట్ అవుతుంది. భారీ చేరికలతో మంచి జోష్ నెలకొంది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. తాజాగా రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు..పొంగులేటి, జూపల్లిలతో పాటు 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇక జులై 2 ఆదివారం ఖమ్మంలో భారీ సభ జరగనుంది. […]