ఛత్తీస్గఢ్లో రోజు రోజుకు కరోనా కేసులు బాగా పెరుగుతున్న క్రమంలో అక్కడ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఒక వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించనున్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు దుర్గ్ జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ భూరే తెలిపారు. ఇప్పటికే ఆ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. దుర్గ్తోపాటు బస్తర్, మహాసముంద్, రాజ్నంద్గావ్, రాయగఢ్, రాయ్పూర్, కొరియా, సుక్మా జిల్లాల్లో […]