ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో తమిళ నటుడు విశాల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వతహాగా తెలుగువాడైన విశాల్..తమిళనాడు వెళ్ళి అక్కడ హీరోగా సెట్ అయిన విషయం తెలిసిందే. విశాల్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త జికే రెడ్డి అనే సంగతి తెలిసిందే..వీరిది చిత్తూరు జిల్లా. అలాగే కుప్పంలో అంతకముందు వ్యాపారాలు కూడా చేశారు. పైగా రెడ్డి సామాజికవర్గం కావడంతో విశాల్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున కుప్పంలో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. […]
Tag: chandrababu
టీడీపీతో ఏపీ కాంగ్రెస్ జత.. అదిరిపోయే స్కెచ్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడంటే తడబాటులో ఉంది. కానీ, వాస్తవానికి సంస్థాగత ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉంది. దీనికి కాస్త బూస్టప్ ఇస్తే.. పార్టీ పుంజుకోవడం.. మళ్లీ పునర్వైభవం ఖాయమ నేది పార్టీ నాయకుల అభిప్రాయం. దీనికి కావాల్సిందల్లా.. కొంత వ్యూహం.. మరికొంత చొరవ. ఇవి రెండూ లేకపోవడంతోనే పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ విఫలమైంది. బహుశ..ఈ దిశగా ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షులుగా వ్యవమరించిన రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్లు ప్రయత్నించలేదు. కేవలం క్షేత్రస్థాయిలో […]
బాబు దూకుడు..నెల్లూరులో టీడీపీ రాత మారేనా!
టీడీపీని గాడిలో పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. జిల్లాల టూర్లకు వెళుతూ..పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఇక బాబు పర్యటనలకు జనం నుంచి భారీ స్పందన కూడా వస్తుంది. ఇప్పటికే కర్నూలు, ఏలూరు, బాపట్లలో బాబు టూర్లకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఆయన తెలంగాణపై కూడా ఫోకస్ చేశారు..21వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభలో […]
టీడీపీకి ఇంచార్జ్లు లేరు..బాబు కష్టమే..!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది…గట్టి చూసుకుంటే మరో ఏడాదిలో ఎన్నికల హడావిడి మొదలైపోతుంది..ఇంకా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్తితి ప్రతిపక్ష టీడీపీది. ఎలాగో వైసీపీ అధికార బలంతో కనిపిస్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేయాలని చూస్తుంది. ఇక వైసీపీకి అడ్డుకట్ట వేయడం అనేది టీడీపీకి కష్టమైన పని. చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. అయితే వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టేందుకు చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారు. చాలావరకు పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. అసలు 2019 ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీలో […]
ముందస్తు వదలని బాబు..జగన్ ప్లాన్ అదే.!
ముందస్తు ఎన్నికల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వదలడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నుంచి బాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని, టీడీపీ శ్రేణులు రెడీగా ఉండాలని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. అయినా బాబు వర్షన్ ముందస్తుపైనే ఉంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, […]
బాబుకు సీటు ఫిక్స్ చేసిన పెద్దిరెడ్డి..కుప్పం వదిలేసినట్లే!
టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ బెదిరింపులతోనో..పథకాలు పోతాయని భయం తెప్పించడమో..లేక పలు రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించుకుని..కుప్పంలో కొంతమంది టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు. అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అయితే […]
బాబు కొత్త నినాదం..’బై బై బాబు’లా క్లిక్ అవుతుందా!
రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి పార్టీలు రకరకాల వ్యూహాలతో వస్తాయి. సరికొత్త నినాదాలతో ప్రజల్లోకి వెళ్తారు. అవి క్లిక్ అయితే పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి నినాదాలతోనే టీడీపీ ముందుకెళుతుంది. ఇప్పటికే బాదుడేబాదుడు కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్లారు. ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంతో ముందుకెళుతున్నారు. అంటే జగన్ వచ్చాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, అసలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు బాగానే […]
బీసీ జపం..జగన్ సక్సెస్ అయినట్లేనా.!
అధికార వైసీపీ ఇటీవల బీసీల జపం ఎక్కువ చేస్తుంది..వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటినుంచే కులాల వారీగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ప్రతి వర్గం టీడీపీకి యాంటీగా మారడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాలని టార్గెట్ చేశారు. తాజాగా జయహో బీసీ సభని కూడా నిర్వహించారు. అయితే ఈ సభ ద్వారా..బీసీలకు తామే ఎక్కువ చేశామని, చంద్రబాబు ఏమి చేయలేదని, బాబు బీసీలకు అన్యాయం చేశారని జగన్ చెప్పుకొచ్చారు. బీసీలంటే […]
వెస్ట్లో బాబు సత్తా..టీడీపీకి కలిసోచ్చేనా!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే..ఇక్కడ పార్టీకి గట్టి బలం ఉంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు..అయితే గత ఎన్నికల్లో నాయకులు వ్యతిరేకత తెచ్చుకోవడం వల్ల టీడీపీకి దెబ్బ పడింది. కానీ నిదానంగా వెస్ట్ లో సీన్ మారుతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంటే..టీడీపీ బలపడుతుంది. ఇక టీడీపీ బలం పెరుగుతుందనే దానికి ఉదాహరణ..తాజాగా చంద్రబాబు పర్యటనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే. ఈ మధ్య కాలంలో బాబుకు జనం […]