రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తుంటారు. తమ ఇమేజ్ను పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. పోస్టర్లను వేసుకుంటూ హోరెత్తిస్తుంటారు. అయితే కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు ఆఖరికి కొవిడ్ మరణాలను కూడా తమ ప్రచారానికి వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మశానానికి స్వాగతం అంటూ కట్టిన ఫ్లెక్సీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం కర్నాటక రాష్ట్రం నెలమంగల తాలూకా […]