ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకుండానే అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి నోటిఫికేషన్ రాకుండానే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసేశాడు. మంత్రి అఖిలప్రియకు సైతం తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడం కఠినపరీక్షగా మారింది. దీంతో ఆమె సోదరుడిని వెంటపెట్టుకుని ఆశీర్వాద […]