బలవంతపు సర్వేలు…. రైతుల్లో కలకలం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు సర్వేలు రైతుల్లో కలకలం రేపుతోంది. రైతులు అనుమతి లేకపోయినా వారి భూముల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. రికార్డులు సరిచేస్తామని నమ్మబలికి రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.భైరెడ్డిపాలెంకు చెందిన బోయి గురమ్మకు సర్వే నెంబర్‌ 58లోని 1లో 4 ఎకరాలు భూముంది. ఎయిర్‌పోర్టుకు తన జిరాయితీ భూమిని ఇవ్వనని ఖరాఖండిగా చెప్పింది. అయితే అధికారులు వ్యూహాత్మకంగా గురమ్మ భూ రికార్డులు సరి చేస్తామని చెప్పి సంతకాలు […]