బీజేపీ అస్సాంలో విజయం దిశగా పరుగులు తీస్తున్నది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్యతను చాటుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాలకు ఎగబాకింది. అక్కడి అధికార టీఎంసీ పార్టీకి సవాల్గా నిలిచింది. ఇంతగా యావత్ భారతదేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చతికిలపడిపోయింది. డిపాజిట్లను కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారి పోయింది. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడుస్థానంలో కొనసాగుతుండగా అక్కడ కేవలం 15వేల ఓట్లను మాత్రమే సాధించగలిగింది. […]