గులాబీ ‘అభ్యర్ధులు’ రెడీ..ఆ సిట్టింగులకే నో ఛాన్స్.!

మరో మూడు రోజుల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ రానుంది. ఈ నెల 21న సి‌ఎం కే‌సి‌ఆర్..తమ పార్టీ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేయనున్నారు. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలిసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 10 లోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 కాంగ్రెస్, 7 ఎం‌ఐ‌ఎం, 3 […]

లోకేష్‌కు కేశినేని హ్యాండ్..బెజవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ?

మరో రోజులో విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ కానున్న విషయం తెలిసిందే. మంగళగిరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇస్తారు. మొదట విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. 20వ తేదీన విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లోకి వెళ్తారు. 21వ తేదీన గన్నవరంలో పాదయాత్ర చేసి..అక్కడే భారీ సభ ఏర్పాటు చేస్తారు. 22న హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడుకి వెళ్ళి..అటు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలోకి ఎంట్రీ ఇస్తారు. […]

బాబుకు జనాదరణ కరువు..అక్కడ నుంచే డౌట్.!

బాదుడే బాదుడు అంటూ గత రెండేళ్ల క్రితం..జగన్ సర్కార్ పన్నుల బాదుడుపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టి‌డి‌పి నేతలని జనంలోకి పంపారు. ఏ విధంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు దిగిందో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేశారు. ఇక చంద్రబాబు సైతం ప్రజల్లో తిరిగారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. ఈ స్పందన ఎవరూ ఊహించలేదు. […]

అమ్మకు అగ్నిపరీక్ష.. ఏం చేస్తారో చూడాలి మరి….!

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ షర్మిళ కొత్త అధ్యక్షురాలుగా రాబోతున్నారా..? పత్రికలో వచ్చిన కథనం మేరకు ఇదే జరగబోతోంది. అయితే ఇది జరిగే పనేనా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పాలు-నీళ్లలా ఉన్న జగన్‌-షర్మిళలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిన మాట వాస్తవమే. కానీ ఆమె నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే.. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయి… పరిస్థితులు మారాయని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో […]

మంగళగిరి టూ మంగళగిరి.. ఊహించని మార్పు..!

పాదయాత్ర ఓ నాయకుడిలో ఇంత మార్పు తెస్తుందా..? గతానికి భిన్నంగా మనిషిని పూర్తిగా మార్చేస్తుందా..? నాయకత్వ లక్షణాలను అబ్బేలా చేస్తుందా..? నారా లోకేష్‌ పాదయాత్ర జరిగిన తీరు.. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. సరిగ్గా 188 రోజుల క్రితం లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మంగళగిరి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పర్యటనలు.. గడప గడపకు కార్యక్రమాలు ముగించుకుని పాదయాత్రకు వెళ్లిన లోకేష్‌ మళ్లీ 185 రోజుల తర్వాత […]

ఇదేం ఘోరం గోవిందా..?

అవును పాపం భూమన అనాల్సిందే. ఏ మూహుర్తంలో రెండోసారి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఫిక్స్‌ అయిందో కానీ.. ఆ సమయం ఆయనకు అంతగా కలిసి వచ్చినట్టు లేదు. తిరుమల కొండపై చిరుత ఓ చిన్నారిని చంపేయడమనే హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. సంఘటన చాలా బాధాకరం. అయితే ఆ తర్వాత జరిగిన ఘటనలు.. తీసుకున్న నిర్ణయాలు.. చేసిన కామెంట్లు ఇప్పుడు భూమనను ట్రోల్స్‌కు గురి చేయడంతో పాటు.. మొత్తంగా ప్రభుత్వాన్నే డామేజ్‌ చేస్తున్నాయి. చిన్నారిని చిరుత చంపేసిన […]

నా త‌మ్ముడిని వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించండి… మంచు విష్ణు సంచ‌ల‌న కామెంట్స్‌

మంచు విష్ణు కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు సినీవారసుడు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమాల్లో బిజీగా ఉన్న మంచు విష్ణు ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంట‌ర్వ్యులో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్నీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారి నా..?అంటూ విష్ణు క‌మెంట్ చేశాడు. ఆయన సినిమాల గురించి అడిగితే నేను […]

కృష్ణాలో లోకేష్ మూడు రోజులే..స్పెషల్ టార్గెట్ వంశీ.!

లోకేష్ యువగళం పాదయాత్ర అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో కాస్త ప్రజాదరణ ఉంటుంటే..కొన్ని చోట్ల ప్రజాదరణ ఉండటం లేదు. ఇక అలా అలా రాయలసీమ నుంచి కోస్తా వరకు లోకేష్ పాదయాత్ర వచ్చింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ అయిదురోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీ […]

విశాఖలో ఎవరి బలమెంత? ఆధిక్యం ఎటువైపు?

అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]