టార్గెట్ సీతక్క: ములుగులో 30 వేల మెజారిటీ సాధ్యమేనా?

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క..ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఒక ప్రజాప్రతినిధి అంటే ఇలాగే ఉండాలనే విధంగా నడుచుకునే నాయకురాలు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటూ వస్తున్న సీతక్కకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు బి‌ఆర్‌ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమెని ఓడించాలని చూస్తున్నారు. అయితే ప్రజల్లో పాతుకుపోయిన సీతక్కని ఓడించడం అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ములుగులో ఆమె బలంగా ఉన్నారు. సీతక్కని ఓడించడం అనేది సాధ్యమయ్యేలా […]

జగన్ క్లియర్ స్కెచ్..99.5 అంటూ ఎత్తు.!

నో డౌట్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో అదే తేల్చారు. ఇంకా ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని, ఈలోపు అందరూ కష్టపడి చేసి..పార్టీ గెలుపుకు కృషి చేయాలని మంత్రులకు సూచించారు. దీంతో జగన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో సంక్షేమంతోనే ప్రజల ఓట్లు దక్కించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదివరకు ఎవరు అమలు చేయని విధంగా తాను మాత్రమే పెద్ద ఎత్తున సంక్షేమ […]

మిషన్ రాయలసీమ..వైసీపీ టార్గెట్‌తో లోకేష్.!

గత వంద రోజుల పై నుంచి రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట లోకేష్ పాదయాత్రపై ప్రజలకు పెద్ద అంచనాలు లేవు. అలాగే అనుకున్న విధంగా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు. కానీ నిదానంగా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో […]

మైదుకూరులో సైకిల్ జోరు..కడపలో గెలుచుకునే ఫస్ట్ సీటు.?

జగన్ సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ నిదానంగా పికప్ అవుతుంది. ఇంతకాలం అక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు..కానీ ఇప్పటివరకు కాంగ్రెస్, వైసీపీలని గెలిపిస్తూ వస్తున్న కడప ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా గెలుపుకు దూరమైన టి‌డి‌పి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో జిల్లాలో లోకేశ్ పాదయాత్ర టి‌డి‌పికి ఊపు తెస్తుంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సక్సెస్ అయిన పాదయాత్ర..మైదుకూరులో ఊహించని స్థాయిలో విజయవంతమైంది. లోకేశ్ సభకు భారీ […]

బీజేపీతో బాబు..పొత్తులో ట్విస్ట్..సీట్లు ఇవేనా?

ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి..ఇప్పటివరకు వైసీపీని గద్దె దించడానికి టి‌డి‌పి-జనసేన మాత్రమే కలిసి ముందుకెళుతున్నాయనుకునే తరుణంలో..చంద్రబాబు..కేంద్రంలోని పెద్దలతో భేటీ కావడం సంచలనంగా మారింది. మరి ఈయన అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరితే..ఢిల్లీ పెద్దలు ఇచ్చారా? లేక వారే బాబుని ఢిల్లీకి ఆహ్వానించారా? అనేది తెలియదు గాని..ఇప్పుడు బాబు..అమిత్ షాతో భేటీ కావడం సంచనలంగా మారింది. ఒకవేళ అమిత్ షా ఒక్కరితోనే భేటీ ఉంటే ఏదైనా ప్రభుత్వ వ్యవహారం అనుకోవచ్చు. కానీ ఈ భేటీలో బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు […]

టీడీపీలో ఎన్‌ఆర్‌ఐలకు షాక్..సీటు లేదట.!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో టి‌డి‌పి నేతలు ఫుల్ యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. అయితే గెలుపు అవకాశాలు మెరుగు పడుతుండటంతో గతంలో యాక్టివ్ గా లేని నేతలు సైతం ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇదే సమయంలో ఎన్‌ఆర్‌ఐలు సైతం రేసులోకి వచ్చారు. వారు సొంత నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ట్రస్టులు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు..భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పార్టీకి ఫండింగ్ కూడా భారీగానే ఇస్తున్నారు. అయితే చాలామంది ఎన్‌ఆర్‌ఐలు సీటు ఆశించి ఇలా సేవా […]

వారాహితో పవన్ రెడీ..జనసేన స్థానాలపైనే గురి.!

మొత్తానికి ఎన్నికల సమరంలోకి పవన్ కూడా దిగుతున్నారు. ఇంతకాలం ఆయన సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉండిపోయారు. కానీ ఇటు ఏపీలో జగన్, చంద్రబాబుల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అలాగే ఎన్నికల సమరానికి ఇద్దరు నేతలు రెడీ అయ్యారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో బాబు మరింత దూకుడుగా ఉంటూ..అభ్యర్ధులని సైతం ఖరారు చేసే పనిలో ఉన్నారు. అటు మేనిఫెస్టోని సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. అటు జగన్ భారీ […]

సీట్లపై బాబు క్లారిటీ..ఆ నేతలకు షాక్ తప్పదు.!

నెక్స్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు పార్టీని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో బాబు కఠినంగా ఉంటున్నారు. గతంలో మొహమాటనికి పోయి గెలవలేని నేతలకు కూడా సీట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు..గెలవడం కోసం ఎలాంటి నేతనైన పక్కన పెట్టేస్తామని […]

కుప్పంలో కొత్త ఎత్తు..వైసీపీకి కంచర్ల చెక్ పెట్టగలరా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేస్తుందో తెలిసింది. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా రాజకీయం నడిపిస్తుంది. ఈ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని వైసీపీ పనిచేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొందరు టి‌డి‌పి శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో గెలిచారు. స్థానిక సంస్థలు..ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని […]