ఇప్పుడు గుంటూరు జిల్లా అంతా ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఆయన టీడీపీలో ఓ సీనియర్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జిల్లాలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. సదరు సీనియర్ లీడర్కు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఆయన ఏకపోకడలతో విసిగిపోయిన జిల్లా టీడీపీ వాళ్లంతా ఆయన్ను ఓ పెద్ద అనకొండగా విమర్శిస్తుంటారు. ఆయన ఎన్నో కీలక పదవుల్లో కొనసాగారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జిల్లాలో తన కుటుంబ సభ్యుల వల్ల తీవ్రమైన వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నారు.
టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఆయన ఫ్యామిలీ సభ్యులపై వస్తోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. సదరు నేత కుమారుడు నేరుగా వసూళ్ల దందాకు తెరలేపేశారు. ఇది ఓపెన్ సీక్రెట్. భారీ కాంట్రాక్టుల నుంచి మరుగుదొడ్ల కాంట్రాక్టుల వరకు కమీషన్లకు కక్కుర్తి పడుతూ ఓపెన్గానే వసూళ్ల దందాకు తెరలేపుతున్నారు. ఈ దోపిడీతో విసిగిపోయిన ఆ నియోజకవర్గాల ప్రజలు సదరు కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడు ఏ పదవికి పోటీ చేసినా దారుణంగా ఓడించేయాలని ఇప్పుడే డిసైడ్ అయిపోయారంటే ఆ పుత్రరత్నం దందాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.
బ్రాందీషాపుల నుంచి ఏ వ్యాపారం చేసే వాళ్లు అయినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే. ఇదంతా సదరు నేతాశ్రీకి తెలియకుండా జరుగుతుందనుకోలేం. ఆయన తెరవెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పుత్రరత్నం ఆగడాలే భరించలేకపోతున్నామంటే ఇప్పుడు సదరు నేతాశ్రీ పుత్రికారత్నం కూడా కాంట్రవర్సీలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఆ మధ్యన ఆమె ఎవర్నో బెదిరించి ఓ వివాదంలో చిక్కుకుని వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆమె చేసిన పని జిల్లాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది.
బంగారం ఇస్తే మర్చిపోవాల్సిందేనా..!
సదరు నేత సొంత నియోజకవర్గంలో ఓ ప్రముఖ వ్యక్తి బంగారం షాపు నిర్వహిస్తుంటాడు. ఆ వ్యక్తికి సదరు నేత పుత్రికారత్నం ఫోన్ చేసి ఓ ఫంక్షన్కు తాను, తన మరదలు (ఆ నేత కోడలు) వెళుతున్నాం… రెండు కాస్ట్లీ నెక్లెస్లు పంపించాలని చెప్పిందట. ఫంక్షన్ అవ్వగానే తిరిగి ఇస్తామని చెప్పడంతో సదరు బంగారు వ్యాపారి తన షాపు నుంచి రెండు ఖరీదైన నెక్లెస్లను వాళ్లకు పంపారట.
నెక్లెస్లు ఇచ్చి పది రోజులు గడుస్తున్నా తిరిగి ఇవ్వకపోవడంతో సదరు వ్యాపారి ఆ సీనియర్ నేత కుమార్తెకు ఫోన్ చేసి నెక్లెస్లు ఇవ్వలేదేంటని ప్రశ్నిస్తే ఆయనకు దిమ్మతిరిగే ఆన్సర్ ఆమె ఇచ్చిందట. మా డాడి మీకు ఫేవర్ చేసి, పదవి ఇప్పించాడు కదా అంకుల్ ఇక మీరు దాని గురించి మర్చిపోండని చెప్పడంతో సదరు వ్యాపారికి దిమ్మతిరిగిపోయిందట. ఇక ఆ నేత పుత్రికారత్నం ఇచ్చిన షాక్తో తేరుకోలేకపోయిన ఆయన కోడలికి ఫోన్ చేశాడట. ఆమె తన నెక్లెస్ను ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఆడపడుచు (సదరు నేత పుత్రికారత్నం)కు ఇచ్చానని చెప్పిందట.
దీంతో ఇప్పుడు ఆ పుత్రికారత్నం చేసిన పనిని ఆ బంగారు వ్యాపారి టీడీపీలోని కొందరు సన్నిహితులకు చెప్పి వాపోయాడట. ఈ విషయం ఈ నోటా, ఆ నోటా ఇప్పుడు జిల్లాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ రెండు నెక్లెస్ల విలువ రూ. 50 లక్షల పైమాటే అట. ఈ విషయం ఇలా ఉంటే సదరు నేత పుత్రుడు దందాలు చంద్రబాబు వద్దకు చేరడంతో ఇప్పుడు ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకు సదరు సీనియర్ నేతాశ్రీ ఎవరనేదానిపై ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుందనుకుంట.